గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు: ఇంటర్‌ బోర్డు

ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు కళాశాలలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రకటించారు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని 79 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించకుంటే కళాశాలలు మూసివేస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ పేర్కొన్నారు. ఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుకు సహకరించాలని యాజమాన్యాలను కోరాం. కొన్ని కళాశాలలకు అగ్నిమాపక అనుమతి లేదు. మరికొన్ని కాలేజీలు అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారు. ఈ నెల 25వ తేదీ లోపు హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. 


Popular posts